Saturday, April 20, 2024

తెలంగాణలో 33కు చేరిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా(కోవిడ్-19) వైరస్ కేసులు సంఖ్య 33కు చేరుకుంది. సోమవారం ఒక్క రోజే కొత్తగా ఆరు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారిలో ఒకరు కోలుకొని డిశ్చార్జి కాగా.. మరో 32 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారు కోలుకుంటున్నారన్నారు. మరో 97 మంది కరోనా అనుమానితుల రక్త నమూనాలను పుణె వైరాలజీ ల్యాబ్ కు పంపించామని.. వారి రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు. కాగా, కరోనా వైరస్ సోకి దేశంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందగా, 415 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

Corona positive cases raised to 33 in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News