- Advertisement -
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 5,119కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరి లవ్ అగర్వాల్ తెలిపారు. గత 24 గంటల్లో 773 పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 32 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 402 మంది డిశ్చార్జ్ అయ్యారని, 149 మంది కరోనాతో మరణించారని ఆయన చెప్పారు. మరోవైపు దేశంలో రోజురోజుకు కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలా? లేదా మరికొన్ని రోజులు పొడిగించాలా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వం చర్చిస్తుంది.
Corona Positive Cases rise to 5,119 in India
- Advertisement -