- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిఎస్పీ అలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. లోకల్ కాంటాక్ట్ ద్వారా కరోనా వైరస్ సోకిన వారిలో కొత్తగూడెం డిఎస్పీ (57), ఆయన ఇంట్లో పని మనిషి(33)కి కూడా వైరస్ సోకినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీనితో రాష్ట్రంలో లోకల్ కాంటాక్ట్ ద్వారా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. అటు ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో దశకు చేరుకోవడంతో.. ఇదే తీవ్రతరం కొనసాగితే మూడో స్టేజికి వెళ్ళే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక రాష్ట్రం లాక్ డౌన్ కాగా.. నిన్న రాత్రి నుంచి కర్ఫ్యూ అమలులోకి వచ్చింది.
Corona positive for Bhadradri Kothagudem DSP
- Advertisement -