రంగారెడ్డి: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు రోజురోకు పెరిగిపోతున్నాయి. తాజాగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. శంషాబాద్ పరిధిలో శివాజీ బస్తీలో ఓ ఎస్ఐకి కరోనా వైరస్ సోకింది. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న పోలీస్ ఆధికారికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఎస్ఐ శంషాబాద్ లోని శివాజీ బస్తీ వాసిగా ఆధికారులు చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా ఆయన కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ కు అధికారులు తరలించారు. అయితే ఇప్పటివరకు తెలంగాణలో 3,290 మందికి కరోనా వైరస్ సోకింది. అందులో 1,627మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా… 113 మంది కోవిడ్ తో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,150 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Corona Positive For Police Officer In Shamshabad