Wednesday, April 24, 2024

కొమరంభీం ఆసిఫాబాద్ లో మరో వ్యక్తికి కరోనా

- Advertisement -
- Advertisement -

Covid-19

 

హైదరాబాద్: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తితో సెకండరీ కాంటాక్ట్‌లో ఉన్న జైనూర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం కరోనా కేసులు నాలుగుకు చేరాయి. కరోనా సోకిన వ్యక్తి కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించారు. కరోనా వచ్చిన వ్యక్తిన ఎవరెవరు కలిసారని వివరాలు వైద్య సిబ్బంది సేకరిస్తున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ 700 మందికి సోకగా 18 మంది మృతి చెందారు. భారతదేశంలో కరోనా రోగులు సంఖ్య 13,626కు చేరుకోగా 450 మంది చనిపోయారు.  ఒక్క మహారాష్టలోని కరోనా రోగులు 3202కు చేరుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముంబయి నగరంలో రెండు వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో రెడ్ జోన్ ప్రాంతాలలో కరోనా సమూహ వ్యాప్తి చెందినట్టు స్థానిక మీడియా అనుమానం వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 21,84,566 కు చేరుకోగా 1,46,897 మృతి చెందారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News