- Advertisement -
ప్రముఖ తమిళ్ నటుడు శరత్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన భార్య రాధిక, కూతురు వరలక్ష్మి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం శరత్కుమార్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్టు వారు తెలియజేశారు. కరోనా లక్షణాలు ఏమీ లేకుండానే ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వారు చెప్పారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్కి కరోనా సోకింది. ప్రస్తుతం రాజ్కుమార్ రావ్తో కలిసి ఓ సినిమాలో ఆమె నటిస్తోంది. ఇటీవల చంఢీఘడ్లో ఈ సినిమా షూటింగ్ చేశారు. అక్కడి నుండి వచ్చిన తర్వాత కృతికి కరోనా సోకింది.
- Advertisement -