- Advertisement -
హైదరాబాద్: నాగర్ కర్నూల్ లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ యవకుడికి (32) కరోనా వైరస్ సోకిందని ఆ జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తి ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చాడని తెలిపారు. ఆ యువకుడితో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. యువకుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్ లో ఉంచామని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తే కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలమన్నారు. నాగర్ కర్నూల్లో రెండో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 154కు చేరుకోగా తొమ్మిది మంది చనిపోయారు.
Corona positive to another Person in Nagar Kurnool
- Advertisement -