Friday, March 29, 2024

కరోనా టీకాతో కంగారు వద్దు..!

- Advertisement -
- Advertisement -

నిర్భయంగా వ్యాక్సిన్ టీకాను వేసుకోండి

Corona vaccination in Mancherial

మన తెలంగాణ/లక్ష్మణచాంద: కరోనా టీకాతో కంగారు వద్దని నిర్భయంగా టీకాను వేసుకోవాలని ఎంపిపి కైశం లక్ష్మి రమేష్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా లక్ష్మణ చాంద మండల కేంద్రంలోని స్థానిక పిహెచ్‌సిలో కరోనా టీకాను విడుదల చేశారు.  మొదటి టీకా పబ్లిక్ హెల్త్ నర్స చంద్రకు ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపిపి కైశం లక్ష్మీ రమేష్ మాట్లాడుతూ… ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఈ కరోనా వైరస్‌కు స్వస్తి చెప్పేందుకు భారత దేశం టీకాను తయారు చేసిందన్నారు. ప్రజలందరూ ఈ టీకాను నిర్భయంగా వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యులు, ఎంపిటిసి అడ్వాల పద్మ రమేష్,టిఆర్ఎస్ పార్టీ ప్రసిడెంట్ కృష్ణారెడ్డి, సర్పంచ్ ముత్యంరెడ్డి, డాక్టర్ నాగేశ్వర్‌రావు, ఎంపిడిఒ, ఎంపిఒ, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News