- Advertisement -
వాషింగ్టన్ : కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎవరినీ నిర్బంధించేది లేదని, అలాగే మాస్క్లు ధరించడం తప్పనిసరి చేయబోనని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అయితే తనతోపాటు ముగ్గురు మాజీ అధ్యక్షులు బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకోనున్నారని దీని ద్వారా శాస్త్రవిజ్ఞానంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని అలాగే ఎవరికైనా అనుమానాలున్నా తొలగిపోతాయని చెప్పారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని, ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తినా పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహిస్తుందని స్పష్టం చేశారు. తాను జనవరి 20న ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రజలంతా వంద రోజుల పాటు మాస్క్లు ధరించాలని విజ్ఞప్తి చేస్తాను తప్ప రాజకీయంగా ఆజ్ఞాపించబోనని ఆయన అన్నారు.
- Advertisement -