హైదరాబాద్: కరోనా మహమ్మారి అంటు వ్యాధి ధూమపానం సేవించేవారి ఊపిరితిత్తుల పనితీరుని దెబ్బతీస్తుందని కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్ డా. లతాశర్మ పేర్కొన్నారు. ప్రపంచ నోటొబాకోడే సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానంగా మూడు వర్గాలు దీనితో తీవ్రమైన అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, పురుషులు, ధూమపానం చేసేవారు, వృద్ధ్దులపై ఉంటుందని డబ్లూహెచ్ఓ తన నివేదికలో ధూమపానం కోవిద్కి ప్రమాద కారకాల్లో ఒకటి పేర్కొనట్లు ఇది రోగ నిరోధక పనితీరును తగ్గిస్తుందన్నారు. ధూమపానం చేసేవారికి ఏసీఈ2 అధిక వ్యక్తీకరణ ఉంటుందని, ఇది మంటను సూచిస్తుందన్నారు. మద్యం సేవించే వారికి ఎక్కువ రహస్య కణాలు ఉంటాయని, తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురైతారని చెప్పారు కరోనా వైరస్ ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని, పొగాకు తాగేవారికి వేప్ చేసేవారికి తీవ్రమైన ముప్పుకావచ్చన్నారు.
Coronavirus Effect on Smoking Lovers