- Advertisement -
ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కలవర పెడుతోంది. కరోనా ధాటికి మహానగరాలు వణికిపోతున్నాయి. గత 24 గంటల్లో 83,347 కేసులు నమోదుకాగా 1085 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 56.46 లక్షలకు చేరుకోగా 90 వేల మంది మరణించారు. కరోనా నుంచి 45.87 లక్షల మంది కోలుకోగా 9.68 లక్షల ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఒక్క రోజే 9.53 లక్షల మంది కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 6.62 కోట్లకు చేరింది.
- Advertisement -