- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. గత 24 గంటల్లో 1302 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తొమ్మిది మంది మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1.72 లక్షలకు చేరుకోగా 1042 మంది చనిపోయారు. కరోనా నుంచి 1.42 లక్షల మంది కోలుకోగా 29 వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఒక్క రోజే 2230 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ కరోనా టెస్టుల సంఖ్య 25.19 లక్షలకు చేరుకుంది. అత్యధికంగా హైదరాబాద్ జిహెచ్ఎంసి (266), కరీంనగర్ (102), రంగారెడ్డి (98), సిద్దిపేట (92) కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.
- Advertisement -