Saturday, April 20, 2024

ప్రారంభమైన కరీంనగర్ కార్పొరేషన్ కౌంటింగ్

- Advertisement -
- Advertisement -

Karimnagar-Corporation

కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ప్రారంభమై కొనసాగుతోంది. ఈ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇప్పటికే రెండు డివిజన్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిత 58 టివిజన్లకు కౌటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు. కౌంటింగ్  ప్రక్రియ కోసం 58 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అందుకు గానూ  58 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, ఇద్దరు అసిసెంట్లను, 20మంది మైక్రో అబ్జర్వర్లు ఈ ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు. మొదట డివిజన్ల వారిగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఒక్కొ రౌండ్లో వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. సోమవారం సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడికానున్నాయి.

Counting begins for Karimnagar municipal corporation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News