Tuesday, April 16, 2024

రైలుకు ఎదురెళ్లి ప్రేమజంట బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

Suside

మల్కాజిగిరి: రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని మాసాయిపేట గ్రామ సమీపంలో 44 వ జాతీయ రహదారి పక్కన ఉన్న రైలు పట్టాలపై చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే ఎస్‌ఐ తవ్వునాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన రవికుమార్ మెడ్‌ప్లస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రవి కుమార్‌కు వివాహం జరగలేదు.

మల్కాజిగిరి చెందిన సంతోషినికి వివాహం జరిగింది ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మంగళవారం రవికుమార్, సంతోషినిలు కలిసి బైక్‌పై వచి నిజామాబాద్ నుండి సికింద్రాబాద్ వైపు వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కామారెడ్డి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Couple Commits Suicide At Malkajgiri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News