- Advertisement -
అమరావతి: అనంతపురం జిల్లాలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. ధర్మవరం పెరువీధిలో చెందిన దంపతులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఎస్కేయూ క్వారంటైన్లో చికిత్స పొందారు. చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చింది. దీంతో శనివారం సాయంత్రం వారని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన దంపతులు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారం క్రితమే వీరి కుటుంబంలో కరోనాతో ఒకరు మృతి మరణించారు. కరోనాను మహమ్మారిని జయించి దవాఖాన నుంచి ఇంటికి వచ్చిన దంపతులు ఇలా బలవన్మరణానికి పాల్పడడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
- Advertisement -