- Advertisement -
అమరావతి: కుటుంబకలహాలతో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుసుకున్న విషాద సంఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్ల అనంతపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య స్వీటీ(21) బలవన్మరణానికి పాల్పడింది. భార్య ఆత్మహత్య చేసుకున్న గంటలోపే భర్త ముచ్చింద్ర(25) కూడా పొలంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
couple committed suicide by hanging in Anantapuram
- Advertisement -