- Advertisement -
ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల పరిధిలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్వి చక్రవాహనాన్ని కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు లక్ష్మి, అంజిగా గుర్తించారు. ఈ దంపతులు వంట పాత్రలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆదిలాబాద్ లోని దుర్గానగర్ లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు.
Couple Dead in Car collided to Car in Utnoor Mandal
- Advertisement -