Friday, April 26, 2024

బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి

- Advertisement -
- Advertisement -

accident

పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని సోమన్‌గుర్తి స్టేజీలో హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చన్‌గోములు పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం .. నాగర్‌కర్నూల్ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దబోజి ఆనంద్(35), ఆయన భార్య పెద్దబోజి ఉషమ్మ(30)లు హైదరాబాద్‌లో మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే మండలంలోని సోమన్‌గుర్తి గ్రామంలో తన బంధువుల ఇంట్లో జరిగే ఓ శుభకార్యానికి ఉదయం 6:30 గంటల ప్రాంతంలో నగరం నుంచి తన బైక్‌పై వెళ్తూ సోమన్‌గుర్తి స్టేజీ సమీపంలో రోడ్డు దాటుతుండగా వెనక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని కారు బైక్‌ను ఢీకొని కొద్ది దూరం లాక్కెల్లింది. దీంతో విగత జీవులుగా రోడ్డుపై పడి ఉన్న వీరిపై పరిగి వైపు నుంచి వస్తున్న ఏపి10 ఏటి 2825 నెంబర్ గల మరో కారు దంపతులపై నుంచి వెళ్లడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

స్టేజీ వద్ద స్థానికులు కొందరు చూసి వెంటనే కారును పట్టుకొని చన్‌గోములు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న చన్‌గోములు పోలీస్‌లు జరిగిన విషయాన్ని తెలుసుకొని కారును అదుపులోకి తీసుకున్నారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని బావమర్ది ఉప్పరి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Couple death in road accident at Ranga Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News