Saturday, April 20, 2024

నారాయణఖేడ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యభర్తలు మృతి

- Advertisement -
- Advertisement -

Couple Killed in Road Accident in Narayankhed

సంగారెడ్డి: జిల్లాలోని నారాయణఖేడ్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం మండలంలోని  నిజాంపేట సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి మోటర్ సైకిళ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న భార్యభర్తలు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని కామారెడ్డి జిల్లా జలాల్‌పూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Couple Killed in Road Accident in Narayankhed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News