- Advertisement -
నేరుడుగొమ్మ: నల్లగొండ జిల్లా నేరుడుగొమ్మ మండలంలో బుంగతండాలో ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. బుల్లి, నేనావత్ అనే దంపతులు బుంగతండాలో నివసిస్తున్నారు. భార్యభర్తలు అరుబయట నిద్రించినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు వారిని హత్య చేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను అతి త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -