Thursday, April 25, 2024

కరోనా భయం… దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కరోనా వైరస్ సోకడంతో ఓ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శివ వీధిలో నివసిస్తున్న గంజి రాంబాబు అనే వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. అతడి భార్య లావణ్య కూడా కరోనా టెస్టు చేయగా పాజిటివ్ రావడంతో తాను కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి వస్తున్నామని తన తల్లిదండ్రులకు తెలిపింది. ఆస్పత్రికి వచ్చేసరికి లావణ్య, రాంబాబు రాకపోవడంతో పలుమార్లు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లారు. దంపతలిద్దరూ ఇంట్లో ఉరేసుకొని కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాలను కొవిడ్ నిబంధనలకు మేరకు అంత్యక్రియలు జరిపించారు. పది నెలల క్రితం రాంబాబు తండ్రి చనిపోవడంతో అతడు ఇంటికి వచ్చాడు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇక్కడే ఉండిపోయాడు. కరోనా సోకడంతో పాటు వారికి సంతానలేకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని బంధువులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News