Saturday, April 20, 2024

టీనేజర్లకు టీకా

- Advertisement -
- Advertisement -

Covaxin vaccine for all eligible children

వ్యాక్సినేషన్ బాధ్యతను తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు తీసుకోవాలి

ఎలాంటి అపోహలు అక్కర్లేదు 15-18 ఏళ్ల పిల్లలకు
టీకా కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : అర్హులైన పిల్ల లందరికీ కొవాగ్జిన్ టీకా ఇస్తామని మంత్రి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్లలకు టీకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సమక్షంలో పిల్లలకు వ్యాక్సినేషన్ జరుగుతోందని మంత్రి వివరించారు. తెలంగాణలో 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ సోమవా రంప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చే సుకున్న వారికి టీకాలు వేస్తున్నారు. నగరం లోని బంజారాహిల్స్ పిహెచ్‌సిలో మంత్రి హరీ శ్‌రావు పిల్లల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రా రంభించి మాట్లాడారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు కొవాగ్జిన్ ఇస్తున్నామని, టీకా తీసుకున్న నాలుగు వారాల తర్వాత 2వ డోస్ టీకా తీసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులం తా పిల్లలకు విధిగా వ్యాక్సిన్ వేయించాలని పే ర్కొన్నారు. అన్ని కాలేజీల యాజమాన్యాలు, ప్ర ధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లల వ్యా క్సినేషన్ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. కాలే జీలో ప్రతి విద్యార్థి  టీకా తీసుకునేలా అ ధ్యాపకులు బాధ్యత తీసుకోవాలని చెప్పారు.

అర్హులైన పిల్లలందరికీ టీకాలు వేయించాలి

ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన పిల్లలందరికీ టీకాలు వేయించాలని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పిల్లలకు టీకా ఇచ్చేందుకు అనుమతి ఉందని తెలిపారు. గ్రేటర్‌లో 12 కార్పొరేషన్‌లలో ఆన్‌లైన్, ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్ధతిలో టీకాలు ఇస్తున్నామని, నాలుగు రోజుల తరువాత పరిస్థితుల ఆధారంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌పై మరోసారి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, కాలేజీ ఐడీ కార్డ్ ఉన్నా రిజిస్ట్రేషన్‌కు సరిపోతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు, సదుపాయాలు ఉన్నాయని, 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని సూచించారు. వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వస్తది అనే అపోహ వద్దని, కొవిడ్ టీకాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదని అన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే రక్షణ కవచంలా పని చేస్తోందని తెలిపారు.

దేశంలో రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, గత వారంలో పాజిటివిటీ రేటు నాలుగు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. 100 శాతం మొదటి డోస్ టీకా పూర్తి చేసిన రాష్ట్రాలను.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్సులో అభినందించిందని మంత్రి గుర్తు చేశారు. తొలి డోసు వంద శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని చెప్పారు. రాష్ట్రం తరపున కేంద్రాన్ని బుస్టర్ డోస్ గురించి చాలా కాలంగా కోరడంతో పాటు లేఖలు రాశామని తెలిపారు. తొలి రెండు వేవ్ లలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమర్ధంగా పని చేశారని, మూడో వేవ్ వస్తే ఇబ్బంది లేకుండా సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.కరోనా లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, వైద్యారోగ్యశాఖ, ప్రభుత్వం పూర్తి సంసిద్ధంగా ఉందని హరీశ్‌రావు అన్నారు.

మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటనపై కమిటీని ఏర్పాటు చేశాం

సూర్యాపేట మెడికల్ కాలేజి ర్యాగింగ్ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనిపై కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అంశంపై విలేకరులు ప్రస్తావించగా మంత్రి సమాధానమిస్తూ, కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ఘటన జరిగినట్లు రుజువైతే అందులో ఆ ఘటనలో ప్రమేయం ఉన్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటివి పునరాృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News