Friday, March 29, 2024

కవల శిశువులకు జన్మనిచ్చిన కరోనా సోకిన మహిళ

- Advertisement -
- Advertisement -

జమ్మూ: కరోనా వైరస్ సోకిన ఒక మహిళ సోమవారం ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆరోగ్యంతో పుట్టిన ఇద్దరు శిశువులకు కరోనా నెగటివ్ ఉందని, వీరిని తల్లి నుంచి విడిగా వేరే గదిలో ఉంచామని గాంధీనగర్‌లోని మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ శర్మ మంగళవారం తెలిపారు. సిజేరియన్ ద్వారా ఈ ఇద్దరు శిశువులు జన్మించినట్లు ఆయన తెలిపారు. గత ఏడాది జూన్‌లో ఈ ఆసుపత్రిని కొవిడ్-19 కేంద్రంగా మార్చిన తర్వాత సిజేరియన్ నిర్వహించడం ఇదే మొదటిసారని ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. 200 పడకల ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 700 మందికి పైగా కరోనా రోగులకు చికిత్స అందచేసినట్లు ఆయన చెప్పారు.

Covid 19 positive woman blessed to twins in Jammu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News