- Advertisement -
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీదారైన సిరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు తమ పుణే కర్మాగారం నుంచి తొలి బ్యాచ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమతి తిరిగి పునరుద్ధరించబడినట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ తయారీ కంపెనీ ఇప్పటి వరకు మొత్తంగా 1.25 బిలియన్ డోసులను ఉత్పత్తి చేసినట్టు తెలిపింది. పుణే కంపెనీ నుంచి తొలి బ్యాచ్ కోవిషీల్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఎగుమతి శుక్రవారం ఉదయం నుంచి తిరిగి మొదలైంది. 2022 తొలి త్రైమాసికం కల్లా కోవాక్స్ డోస్ల ఉత్పత్తి పెంచనున్నట్లు కూడా ఆ ఫార్మా కంపెనీ తెలిపింది.
- Advertisement -