Friday, March 29, 2024

కరోనాతో వృద్ధురాలు మృతి…. అంత్యక్రియలు జరిపించిన టిఆర్ఎస్ ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

 

నల్లగొండ: టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్ రెడ్డి మానవత్వం చాటుకున్నాడు. కరోనాతో చనిపోయిన వృద్ధురాలుకు  దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాడు. నల్లగొండలోని పాతబస్తీ వంటిస్తంభం ప్రాంతానికి చెందిన పూజారి కుటుంబానికి కరోనా వైరస్ సోకింది. కుటుంబంలో ముగ్గురు సభ్యులతో పాటు ఇంట్లో వృద్ధురాలుకు కూడా కరోనా వైరస్ సోకింది. ఆ వృద్ధురాలును స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఉండలేనని ఇంటికి తిరిగొచ్చింది. మరుసటి రోజు ఆ వృద్ధురాలు చనిపోవడంతో కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ ఉండడంతో వారికి సాయం చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో స్థానిక కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్ స్థానిక ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్ రెడ్డికి సమాచారం ఇచ్చాడు. వెంటనే భూపాల్ రెడ్డి హిందూపూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. దగ్గర ఉండి ఆ వృద్ధురాలుకి అంత్యక్రియలు జరిపించాడు. పూజారి కుటుంబ సభ్యులకు అవసరమైన మందులు, నిత్యావసర సరుకులను అందిస్తామని ధైర్యంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News