Friday, April 19, 2024

18 ఏళ్లు పైబడిన వారు కొవిడ్‌ వ్యాక్సిన్ వేయించుకోవాలి: ఎంపిడిఒ

- Advertisement -
- Advertisement -

Covid vaccine for above 18 years

మనతెలంగాణ/మల్లాపూర్‌: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో కోనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాల సెంటరును శుక్రవారం మల్లాపూర్ ఎంపిడివో రాజ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయాలని వైద్యపిబ్బందికి సూచించారు. మొదటి రెండో డోసులు అందరికి వేసి, 100 శాతం పూర్తి చేయాలన్నారు. సిజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిట్ల సరోజన, పంచాయితీ కార్యదర్శి అందె నరేష్, ఎఎన్‌ఎం కోమల, ఆశ కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News