హైదరాబాద్: నగరంలో పాల ఉత్పత్తి, పాల ఉత్పత్తుల విక్రయాలు అతి ముఖ్యమైన కార్యకలపాలుగా నిలుస్తున్నాయి. నేటి రద్దీ జీవనశైలి కారణంగా వారు ఆహార పోషకాల కోసం పాలు ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు. చాలామంది ప్రజలు అతి తక్కువ కొవ్వుశాతం ఉండటంతో పాటు ఇతర పోషక విలువల కారణంగా ఆవుపాలపై ఆధారపడుతున్నారు. ఈసందర్భంగా సిద్స్ఫార్మ్ ఫౌండర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ మార్కెట్ లభ్యమవుతున్న ఇతర పెరుగు, యోగార్డ్లు మాదిరిగా కాకుండా సిద్స్ ఫార్మ్ విడుదల చేసిన పెరుగులో ఎలాంటి నిల్వ కారకాలు జోడించడలేదన్నారు. మన ఇంటిలోని కమ్మటి రుచి కలిగిన పెరుగు రుచిని ఇది చవిచూపిస్తుందని, పాల పదార్దాలతో ఎక్కువ మంది అభిమాననించేది పెరుగు అని కంపెనీ నమ్ముతుందన్నారు. పాలతో పోలిస్తే పెరుగు త్వరగా జీర్ణమవుతుందని చెప్పారు. క్రీమీ బఫెలో మిల్క్ కర్డ్ను 475 గ్రాములు ప్యాక్లో కేవలం 80 రూపాయలకు, చవులూరించే ఆవు పాల పెరుగు 475 గ్రాముల ప్యాక్లో కేవలం 70 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు.
ఆవు పాలలో పోషక విలువలు ఎక్కువ
- Advertisement -
- Advertisement -
- Advertisement -