- Advertisement -
కరీంనగర్: నూతన సంవత్సర వేడుకలు మితి మీరితే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని సూచించారు. యువకులు అర్థరాత్రి దాటిన తరువాత మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. న్యూయియర్ వేడుకులకు కమిషన్రేట్ పరిధిలో ఎలాంటి అనుమంతి లేదని తెలియజేశారు. వేడుకలతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని మీ కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతగా ఉండాలని సూచనలు చేశారు. గురువారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రత్యేక బృందాలు వాహన తనిఖీలు చేపడుతామని, అతివేగంతో వాహనాలు నడుపుతూ కనిపిస్తే వాహనాలు స్వాధీనం చేసుకుంటామని సిపి హెచ్చరించారు. మైనర్లు బైకులు నడుపుతూ రోడ్లపై కనిపిస్తే వాహన యజమాని, తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.
- Advertisement -