- Advertisement -
యాదాద్రి: తెలంగాణలోని పలు చోట్ల మున్సిపల్ చైర్మెన్ల ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కార్యలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిపిఎం పార్టీ సభ్యలు తమకు మద్దతు ప్రకటిస్తామని టిఆర్ఎస్ కు అనుకూలంగా మారడంతో కాంగ్రెస్ నాయకులు అందోళనలు చేస్తున్నారు. దీంతో చైర్మన్ ఎన్నిక రణరంగంగా మారింది. ఈ క్రమంలో సిపిఎం సభ్యులతో మనుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎంఎల్ఎ రాజగోపాల్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
CPM Congress Fighting in Choutuppal Municipal Office
- Advertisement -