Friday, April 19, 2024

కరోనాతో క్రికెటర్ మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కరోనా వైరస్‌తో ఢిల్లీ జట్టు మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్ చనిపోయాడు. ఇంతకు ముందు సంజయ్‌కు దీర్ఘకాలిక వ్యాధులు ఉండడంతో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నప్పుడు అతడికి కరోనా వైరస్ సోకింది. సంజయ్‌ను వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉండడంతో ఆస్పత్రిలో కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సిదాంత్ రాజస్థాన్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. రెండు కుమారుడు ఎకాన్స్ ఢిల్లీ తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. సంజయ్ ఢిల్లీ జట్టు తరుఫున ఆడాడు. సంజయ్ మృతిపై ఢిల్లీ క్రికెట్ సంఘం సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. సంజయ్‌కు భారత్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మంచి సంబందాలు ఉన్నాయి. తన స్నేహితుడు సంజయ్‌కు డోనర్ కావాలంటూ ఢిల్లీ ప్రభుత్వానికి ట్విట్టర్‌లో గంభీర్ కోరారు. ఆప్ ప్రభుత్వం డోనర్ ఏర్పాటు చేసి ప్లాస్మా చికిత్స చేసినప్పటికి అతడి ఆరోగ్యం విషమించడంతో చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News