Thursday, April 25, 2024

యువరాజ్ క్షమాపణ

- Advertisement -
- Advertisement -

Cricketer Yuvraj Singh apologized

 

న్యూఢిల్లీ: ఇన్‌స్టా లైవ్ కార్యక్రమంలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ క్షమాపణలు కోరాడు. తాను ఎవరిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడలేదని స్పష్టం చేశాడు. ఒక వేళ తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే బహిరంగంగా క్షమాపణ కోరుతున్నట్టు ప్రకటించాడు. కుల, మత, వర్గ తారతమ్యాలు తనకు లేవని, అయినా కొందరూ తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం, చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఎంతో బాధించిందన్నాడు. కాగా, దళితులను కించ పరిచేలా వ్యవహరించాడని ఆరోపిస్తూ హర్యానాకు చెందిన ఓ వ్యక్తి యువరాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యువరాజ్‌పై కేసు నమోదైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News