Thursday, April 25, 2024

టీమిండియాపై ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించిన భారత క్రికెట్ జట్టుపై అభినందనల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, సెహ్వాల్, గవాస్కర్, కుంబ్లే, ద్రవిడ్, లక్ష్మణ్, ఇర్ఫాన్, గంభీర్ తదితరులు ట్విటర్ వేదికగా టీమిండియాను అభింనందించారు. సీనియర్లు లేకున్నా యువ క్రికెటర్లు అసాధారణ ఆటతో చారిత్రక విజయం సాధించడం ఆనందం కలిగించిందని వారు పేర్కొన్నారు.

గెలుపు ఆనందం కలిగించింది: ప్రధాని నరేంద్ర మోడీ
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ గెలుచుకోవడం అమితానందాన్నిచ్చిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీని భారత్ సాధించడంపై ప్రదాని ఆనందం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఈ గెలుపు తనను ఎంతో ఆనందానికి గురిచేసిందన్నారు. ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన తనకు అత్యంత సంతోషాన్ని కలిగించిందన్నారు.
కెసిఆర్, జగన్, కెటిఆర్ అభినందనలు
ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించిన టీమిండియాను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రి కెటిఆర్, ఎపి.సిఎం జగన్‌మోహన్ రెడ్డి తదితరులు అభినందించారు. అసాధారణ పోరాట పటిమతో భారత్ విజయం సాధించడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. అద్భుత గెలుపుతో భారత ఖ్యాతిని ఇనుమడింపచేశారని ప్రశంసించారు.

Cricketers and Politicians Congratulate Team India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News