Friday, March 29, 2024

అత్తాపూర్ వద్ద మూసీలో మొసలి కలకలం… (వీడియో)

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్‌ వద్ద మూసీలో మొసలి కలకలం సృష్టించింది. నిన్న కురిసిన భారీ వర్షానికి జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. గండిపేట, హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తివేయడంతో మూసీలో వరద భారీగా ప్రవహిస్తోంది. ఈ వరదలో మొసలి కొట్టుకొచ్చింది. స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గతంలో కిస్మత్‌పురాలో రెండు మొసలి కళేబరాలు గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. జూ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News