మనతెలంగాణ/జవహర్నగర్: మానసిక వ్యధతో ఓ సీఆర్ఫిఎఫ్ కానిస్టేబుల్ తన సర్వీస్ రైఫిల్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని జవహర్నగర్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ బిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాగ్పుర్ ఉప్పల్వాడి మండలం, పవన్నగర్కు చెందిన బాబన్ విఠల్రావు మన్వర్(40) సీఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా పని చేస్తూ హాకీంపేట సీఆర్పిఎఫ్ క్యాంపులో డ్యూటీ నిర్వహిస్తున్నాడు. భార్య ఇద్దరు పిల్లలు తన సొంత ఊరిలో ఉంటున్నారు. గత నెల రోజులుగా లీవ్లో ఉండి సొంత ఊరికి వెళ్లి వచ్చి తిరిగి ఈ నెల 2వ తేదిన డ్యూటీలో చేరాడు.
అయితే, ఇటివల తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తూ తాను డ్యూటీ చేయలేకపోతున్నానని ఇళ్లు,పిల్లలు గుర్తుకు వస్తూన్నారని బాధపడేవాడని భార్య పోలీసులకు తెలిపింది.ఈ విషయమై మానసిక వ్యధకు గురవుతూ ఈ నెల 8వ తేది ఉదయం 2 గంటల 10 నిమిషాలకు సీఆర్పిఎఫ్ పబ్లిక్ స్కూల్ రోడ్డు వద్ద తన సర్వీస్ రైఫిల్తో తలపై కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఆర్పిఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రత్నమ్మ ఫిర్యాదు మేరకు జవహర్నగర్ ఇన్స్పెక్టర్ బిక్షపతిరావు సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
CRPF Constable shoots self dead in Medchal