Thursday, April 25, 2024

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు, సిఆర్‌పిఎఫ్ జవాను మృతి

- Advertisement -
- Advertisement -

CRPF jawan martyred and Two terrorists killed in encounter

 

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మంగళవారం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ సంఘటనలో సిఆర్‌పిఎఫ్ జవాను కూడా తీవ్ర గాయాలతో మృతి చెందాడు. పుల్వామా జిల్లా బాండ్జూ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందడంతో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. వారిని భద్రతా బలగాలు ప్రతిఘటించడంతో ఇద్దరు ఉగ్రవాదులు, ఒక జవాను ప్రాణాలు కోల్పోయారని పోలీస్ అధికారులు తెలిపారు. సంఘటన ప్రదేశంలో తుపాకులు, బులెట్లు, మందుగుండు సామగ్రి దొరికినట్టు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News