Friday, March 29, 2024

భారత్ బయోటెక్ ఎండితో సిఎస్ సోమేష్‌కుమార్ భేటీ

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar meets with Bharat Biotech MD

హైదరాబాద్: తెలంగాణలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మంగళవారం భారత్ బయోటెక్ సిఎండి, డాక్టర్ కృష్ణ ఎల్లాతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. టీకాలపై సిఎస్, భారత్ బయోటెక్ సిఎండి కృష్ణ ఎల్ల చర్చించారు. వీలైనన్ని ఎక్కువ డోసులు రాష్ట్రానికి ఇవ్వాలని కృష్ణ ఎల్లకు సిఎస్ విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కృష్ణ ఎల్ల తెలంగాణకు ఎక్కువ టీకాలు ఇస్తామని తెలిపారు.

CS Somesh Kumar meets with Bharat Biotech MD

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News