Friday, March 29, 2024

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అందచేయాలి

- Advertisement -
- Advertisement -

CS Somesh kumar review on Aadhaar card Issuance

వాటికి వ్యక్తిగత మొబైల్ నెంబర్‌లను అనుసంధానం చేయాలి
అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అందచేయడంతో పాటు ఆధార్ కార్డులను వ్యక్తిగత మొబైల్ నెంబర్‌లను అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డుల జారీతో పాటు మొబైల్ నెంబర్ల అనుసంధానంపై గురువారం బిఆర్‌ఆర్‌కె భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, పంచాయితీ రాజ్ కార్యదర్శి సందీప్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ, సివిల్ సప్లై కమిషనర్ అనిల్‌కుమార్, అడిషనల్ సిఈఓ బుద్ధా ప్రకాష్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి.దివ్య, సంగీత తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రతి ఏటా ఆరు లక్షల మంది జన్మిస్తున్నారని వీరికి వెంటనే ఆధార్ కార్డులను అందించాలని సిఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల మధ్య వయస్సుగల వారికి ఆధార్ జనరేట్ చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఆధార్ సీడింగ్ కేంద్రాలు లేని మండలాలన్నింటిలో ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఐటిశాఖ కార్యదర్శిని సిఎస్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News