Friday, April 19, 2024

కరోనా వ్యాక్సిన్ పురోగతిపై ఆ రెండు జిల్లాల్లో సిఎస్ పర్యటన

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar tour of districts on corona vaccine progress

హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు వరకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు, వ్యాక్సినేషన్ పురోగతి, మరింత వేగవంతం చేసేందుకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకొని అక్కడ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకొని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణ్ పెట్ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశాలకు సంబంధిత జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ఇమ్యూనైజషన్ అధికారులు, జిల్లా పంచాయితీ అధికారులు, స్థానిక మున్సిపల్ కమీషనర్లు, స్తానిక ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు కూడా హాజరవుతారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News