- Advertisement -
మన తెలంగాణ/నేరడిగొండ: కరెన్నీ నోట్లతో కరోనా సోకుతుందనే భయంతో ఓ మహిళ తన పింఛన్ సొమ్మును డెటాల్ నీళ్లతో కడిగిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలంలో చోటుచేసుకుంది. చేతులకు ప్లాస్టిక్ కవర్లు తొడుక్కుని డబ్బును అందుకున్న ఆమె ఆ సొమ్మును మరో ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంది. పింఛన్ డబ్బులు ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత ఆ డబ్బును డెటాల్ కలిపిన నీటితో కడిగి ఆరబెట్టుకుంది. కరోనా పై ఉన్న భయాన్ని చూసిన వలంటీర్ ఆశ్వర్యపోయాడు.
- Advertisement -