Friday, April 19, 2024

జీతాల్లో కోత

- Advertisement -
- Advertisement -

salary

 

సిఎం, మంత్రులు సహా ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కట్

అఖిల భారత సర్వీసులకు 60%, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో 50%, నాలుగో తరగతి, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల్లో 10% కోత విధింపు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్నందున ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయంచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన సోమవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన పిదప వివిధ రకాల వేతనాల చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నారు. క్లిష్ట సమయంలో ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉన్నందున ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎం ఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించనున్నారు.

ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధిస్తారు. మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత, నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత. అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత విధిస్తారు. నాలగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత పడనుంది.అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత విధించనున్నట్లు సిఎం పిఆర్‌ఒ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Cut in salaries of Government Employees
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News