Thursday, April 25, 2024

విద్యార్థులను అభినందించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్

- Advertisement -
- Advertisement -

Cyberabad CP Stephen congratulated Students

గోల్ఫ్‌లో విజయం సాధించిన గౌలిదొడ్డి టిఎస్‌డబ్లూఆర్‌ఈఐఎస్ విద్యార్థులు

మనతెలంగాణ, హైదరాబాద్ : తమిళనాడులో జరిగిన గోల్ఫ్ పోటీల్లో పాల్గొన్న గౌలిదొడ్డి టిఎస్‌డబ్లూఆర్‌ఈఐఎస్ విద్యార్థులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అభినందించారు. తమిళనాడులోని కోయంబత్తురు,కర్నాటకలోని కోలార్ జిల్లాలో జరిగిన గోల్ఫ్ పోటీల్లో పాల్గొన్న ఎడో, ఎనిమిదో తరగతి విద్యార్థులు శనివారం సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్రను కలిశారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని కోరారు. ఇటీవల నిర్వహించిన ఇన్విటేషనల్ ట్రోఫీని గెల్చుకున్న విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించేలా శిక్షణ ఇవ్వాలని గోల్ఫ్ కోచ్ భాస్కర్‌శ్యాముల్‌ను కోరారు. విద్యార్థులు అమూల్య, హరిత, మధు, సాగర్, విగ్నేష్, ముకుల్, నవీన, అనూష, అఖిల, ప్రిసిలా, ప్రగతి కలిశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News