- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : తీవ్రగాయాలపాలైన ఓ మహిళను సైబరాబాద్ పోలీసులు కాపాడారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన సంగీత(25) ప్రమాదవశాత్తు మాదాపూర్ సమీపంలోని రైల్వే పట్టాల వద్ద గాయపడింది. విషయం తెలుసుకున్న మాదాపూర్ పెట్రోలింగ్ ఆఫీసర్లు హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీరాములు, డ్రైవర్ రమణ మహిళను కాపాడి ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. తర్వాత జిఆర్పి పోలీసులకు విషయం చెప్పారు. మహిళను కాపాడిన పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అభినందించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా సిబ్బంది పనిచేయాలని కోరారు.
Cyberabad Police who rescued Woman
- Advertisement -