హైదరాబాద్: కరోనా విధులు నిర్వర్తిస్తున్న సైబరాబాద్ పోలీసులకు హార్స్కో ఎన్విరాన్మెంట్ ప్రతినిధులు డాబర్ చవన్ప్రాష్ను అందజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం సంస్థ ప్రతినిధులు సిపి విసి సజ్జనార్ను కలిసి 6వేల కిలోలు చవన్ప్రాష్ బాటిళ్లను అందజేశారు. కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఇమ్యూనిటీ బలంగా ఉండాలని చవన్ప్రాష్ను అందజేసినట్లు హార్స్కో ఎన్విరాన్మెంట్ అధ్యక్షుడు శివకుమార్ సుబ్రహ్మణ్యం అన్నారు. గత ఐదు నెలల నుంచి పోలీసులు కరోనా సేవలు చేస్తున్నారని అన్నారు. ప్రజల రక్షణ కోసం చాలా కృషి చేస్తున్నారని అన్నారు. హార్స్కో ప్రతినిధులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అభినందించారు. కార్యక్రమంలో సంస్థ హెచ్ఆర్ హెడ్ వాణి, ప్రతినిధులు, ఎస్సిఎస్సి జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల తదితరులు పాల్గొన్నారు.
Chyawanprash bottles to Cyberabad Police