Friday, March 29, 2024

రామస్వామీ, దళితబంధు సదస్సుకు రండి

- Advertisement -
- Advertisement -

Dalit Bandhu biggest scheme in world Says CM KCR

హైదరాబాద్: దళితబంధు ప్రపంచంలోనే పెద్ద పథకమని సిఎం కెసిఆర్ అన్నారు. జమ్మికుంట మండలం తనుగుల ఎంపిటిసి భర్త రామస్వామికి ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ఫోన్ చేశారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కెసిఆర్ సూచించారు. హుజూరాబాద్ పరిధిలోని ఎస్సీలందరూ ఈ నెల 26న ప్రగతిభవన్ కు రావాలని సిఎం ఆహ్వానించారు. 427 మంది దళితులతో సిఎం కెసిఆర్ సమావేశం కానున్నారు. దళిత బంధు గురించి అన్ని గ్రామాల్లో తెలియజేయాలని కెసిఆర్ చెప్పారు. హుజూరాబాద్ లో దళిత బంధు విజయంపై ఎస్సీల భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. దేశానికి, ప్రపంచానికి సందేశం ఇచ్చే పథకం.. దళిత బంధు అని ఆయన పేర్కొన్నారు. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుందన్నారు. దళిత బంధు పథకాన్ని బాధ్యతతో విజయవంతం చేయాలని ఆదేశించారు.

Dalit Bandhu biggest scheme in world Says CM KCR

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News