- Advertisement -
లక్నో: అత్యాచార బాధితురాలిని నిందితుడి కుటుంబం వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దళిత కులానికి చెందిన ఓ అమ్మాయిపై కామాంధుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. నిందితుడిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. నిందితుడి కుటుంబ కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలితో చర్చలు జరిపారు. కేసు వాపసు తీసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఆమెను బెదిరించిడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్లో నిందితుడి కుటుంబం వేధింపులతో చనిపోతున్నానని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -