Thursday, April 18, 2024

‘బలగం’ సినిమా గాయకులకు కారు

- Advertisement -
- Advertisement -

‘బలగం’ సినిమా గాయకులకు దళితబంధు పథకం కింద కారు పంపిణీ చేశారు. మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు బుధవారం కారును అందజేశారు. మొగిలయ్య, కొమురమ్మ  ‘బలగం’ సినిమాలో పాటలు పాడిన విషయం తెలిసిందే. ఈ పాటలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాయి.

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మించిన‌ సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మార్చి 3న రిలీజైన ఈ సినిమా స‌క్సెస్‌ టాక్ తెచ్చుకుని ఎన్నో జాతీయ అవార్డులను సోంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News