Thursday, April 25, 2024

కాళ్లు కడిగించుకోవడం ఈటెల అహంకారానికి నిదర్శనం: దానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌పై ఎంఎల్‌ఎ దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో దళితులందరికీ ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన బావమరిది మధుసూదన్ రెడ్డి దళితులను అవమానకరంగా తిడుతుంటే దళితులతో కాళ్లు కడిగించుకోవడం ఈటల అహంకారానికి నిదర్శనమని దానం దుయ్యబట్టారు. దళితబంధు ఒక హుజూరాబాద్‌లోనే ఇస్తున్నారని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దళితులకు అండగా నిలబడేందుకు సిఎం కెసిఆర్ దళిత బంధు పథకాన్ని తెచ్చారని ప్రశంసించారు. హుజూరాబాద్ ప్రజలు ఈటెలకు గుణపాఠం చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News