Thursday, April 25, 2024

వాలెంటైన్స్ డే… ప్రాణం తీసిన ప్రేమ

- Advertisement -
- Advertisement -

Daughter commit suicide against love in RR

 

రంగారెడ్డి: ప్రేమికుల రోజున ప్రేమను తల్లిదండ్రులు తిరస్కరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మోకిలా తండాకు చెందిన అనూష (19) అనే అమ్మాయికి మహారాష్ట్రానికి చెందిన యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఫేస్ బుక్ లో పరిచయం ఇద్దరు మధ్య ప్రేమగా మారింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రకు రావాలని యువతిని యువకుడు కోరడంతో బెంగళూరు వెళ్తున్ననని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాల్ డేటా సహాయంతో యువతి ఆచూకీ తెలుసుకొని ఫోన్ చేసి ఇంటికి రావాలని పోలీసులు ఆమెకు సూచించారు. యువతి ఇంటికి చేరుకున్న తరువాత ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలపడంతో వాళ్లు తిరస్కరించారు. దీంతో యువతి బాత్రూమ్ లోనికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News