బెంగళూరు: కత్తితో దాడి చేయబోయిన టెకీని కూతురు తన ప్రాణ రక్షణ కోసం చంపిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 46 ఏళ్ల టెకీ తన భార్య చనిపోవడంతో పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. భార్య చనిపోయినప్పటి నుంచి తీవ్ర మనోవేధనకు గురవడంతో మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించిన అనంతరం ఫియానో వాయించేవాడు. ఫియాన్ శబ్ధంతో ఇరుగుపొరుగు వారు ఇబ్బంది పడేవారు. పలుమార్లు ఇరుగుపొరుగువారితో గొడవలు పెట్టుకున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో టెక్కీ కూతురు(14) చదువుకుంటుండగా అతడు మద్యం మత్తులో ఫియానో వాయించాడు. ఆమె చదువుకు ఇబ్బంది కలగడంతో ఫియానో వాయించొద్దని హెచ్చరించింది. తనకే ఎదురు తిరుగుతావా అని ఆమెపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా బాలిక బ్లేడ్ తో దాడి చేసి తన రూమ్ లోకి వెళ్లిపోయింది. గురువారం తెల్లవారుజామున డోర్ ఓపెన్ చేసి చూడగా తండ్రి చనిపోయి కనిపించాడు. వెంటనే బంధువులు, పోలీసులకు ఆమె సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి టెకీ కూతురుని అదుపులోకి తీసుకొని జువైనల్ హోమ్కు తరలించారు.