- Advertisement -
మల్దకల్: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతోనేపల్లితాండ దగ్గర కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాలువలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి దేహంపై రెడ్, బ్లాక్, వైట్ లైన్స్ తో షర్ట్, బ్లాక్ షార్ట్ ఉంది. అతడి వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒంటిపై గాయాలు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
- Advertisement -